మరణించిన కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించిన జడ్పీ చైర్మన్ కమల్ రాజు

Published: Tuesday June 15, 2021

మధిర, జూన్ 14, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది మధిరలో ఇటీవల మృతిచెందిన కుటుంబాలను పరామర్శించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుమధిర పట్టణంలో ఇటీవల మరణించిన కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలో టిఆర్ఎస్ నాయకులు పల్లపోతు ప్రసాద్ గారి తండ్రి గారు ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆవుల రామకృష్ణ గారి తల్లి గారు ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సైదా గారి తండ్రి గారు మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించినారు. అకాల మరణం పొందిన కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు మనోధైర్యాన్ని కల్పించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు. వారి వెంట టిఆర్ఎస్ నాయకులు కనుమూరు వెంకటేశ్వర్లు, అరిగె శ్రీనివాసరావు, వై వి అప్పారావు, ఇక్బాల్, pyari, జేవీ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.