కలెక్టర్ ను కలిసిన బోనకల్ సర్పంచ్ సైదా నాయక్

Published: Wednesday August 24, 2022
బోనకల్, ఆగష్ట్ 23 ప్రజా పాలన ప్రతినిధి: జిల్లా కలెక్టర్ వీ పి గౌతమ్ ను బోనకల్ సర్పంచ్ భూక్య సైదా నాయక్ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకమైన పూల మొక్కలను అందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదవ విడత పల్లె ప్రగతి లో భాగంగా బోనకల్ ఆర్ఓ బ్రిడ్జి కింద కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన సుందరీకరణ పనులు పూర్తి చేశామని సర్పంచ్ భూక్య సైదా నాయక్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంపై కలెక్టర్ వీపీ గౌతమ్ సర్పంచ్ కు అభినందనలు తెలుపుతూ ఆర్ ఓ బి క్రింద పూర్తి చేసిన సుందరీకరణ పనులను త్వరలో పరిశీలించనున్నట్లు తెలిపారు. అనంతరం సర్పంచ్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి వింజం అప్పారావు, జిల్లా పంచాయతీ అధికారి, జూపల్లి. హరి ప్రసాద్ లను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందించారు.