ఘనంగా కాన్షీరామ్ 15వ వర్ధంతి

Published: Sunday October 10, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 09, ప్రజాపాలన ప్రతినిధి : శనివారం రోజు మన్యవర్ కన్షిరాం 15వ. వర్ధంతి సందర్భంగా అబ్దుల్లాపూర్మెట్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మున్సిపల్ అధ్యక్షులు బాబు  అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తుర్కయాంజల్ అధ్యక్షులు బాబు మాట్లాడుతూ మహనీయుల ఆశయసాధనకు బహుజన రాజ్య స్థాపన కొరకు ఏర్పాటు చేసిన బిఎస్పి పార్టీ ని ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో రాజ్యాధికారం సాధించడమే మా యొక్క లక్ష్యం అని దీనికై తుర్కయంజాల్ లో ఉన్న ప్రతి దళిత బహుజన గిరిజన బిడ్డలు కలిసి అధికార తెరాస పార్టీ పై ఓటు చైతన్యంతో ప్రగతి భవన్ మెట్లు ఎక్కాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి బి.రమణ ఎల్.రాజు పట్నం రమేష్ వర్మ నెమలి సత్యనారాయణ అశోక్ సైదులు హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.