అశ్వాపురం యువతకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సముద్రాలు జితేందర్. అశ్వాపురం ( ప్రజా పాలన.)

Published: Monday November 14, 2022
మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శనివారం స్థానిక ఎస్ ఐ సముద్రాల జితేందర్ యూత్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సరైన మార్గం ఎంచుకోవాలని, చెడు అలవాట్లకి బానిస కాకుండా మంచి మార్గంలో ప్రయాణించాలని సూచించారు. ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు డయల్ 100 , సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని , యూత్ సభ్యులు చెడు వ్యసనాలకు కొట్లాటలకు దూరంగా ఉండాలని, ఉన్నత విద్యను అభ్యసించి గ్రామానికి, మండలానికి సమాజానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.