ఉప్పరిగూడ లో జరిగిన అభివృద్ధి పనులు, పాఠశాలను పరిశీలించిన ఆడిషినల్ డి ఆర్ డి ఓ ఆర్డివో నీరజ

Published: Thursday August 26, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 25 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామపంచాయతీ లోని పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక, అవెన్యూ ప్లాంటేషన్ మరియు ఎన్ఆర్ఈజీఎస్ పనుల సెవెన్ రిజిస్టర్స్ లను అడిషనల్ డిఆర్డిఓ నీరజ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు ప్రారంభం అవుతున్నందున గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా తరగతి గదులు మరియు పాఠశాల ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలు చెత్తాచెదారాన్ని  తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హెచ్ మహేష్ బాబు, ఏ పీ ఓ లలిత, పంచాయతీ కార్యదర్శి రిషిక నేత,  కుమార్ తది పాల్గొన్నారు.