*అయ్యప్ప స్వామి పడిపూజకు 50వేల రూపాయల విరాళం*
Published: Wednesday December 14, 2022
మంచిర్యాల టౌన్, డిసెంబర్ 13, ప్రజాపాలన:
క్యాతనపల్లి మున్సిపాలిటీ లోని కోదండ రామాలయంలో ఈ నెల 18న జరగబోయే అయ్యప్ప స్వామి పడిపూజ, మహా అన్నదానం కార్యక్రమానికి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి, అందుగుల శ్రీనివాస్ 50వేల రూపాయలు మంగళవారం రోజున అయ్యప్ప స్వాములకు విరాళాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్, అక్కల రమేష్, ఆరుముళ్ళ పోశం, పట్టణ ప్రధాన కార్యదర్శిలు మాస్ సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు సంగా రవి, జంగపెల్లి మల్లయ్య, బీజేవైఎం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కున్సోత్ సంతోష్ రామ్, సాయి, మహిళా మోర్చా అధ్యక్షులు మేదరి లక్ష్మి, బెజ్జంకి కవిత, శివ, మల్లయ్య, వైద్య శ్రీనివాస్, బైరి మల్లేష్, పాల్గొన్నారు.
Share this on your social network: