నేలకోండపల్లి మండలం లో పలు కుటుంబాలను పరామర్శించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు

Published: Tuesday August 02, 2022
పాలేరు ఆగస్ట్ 1 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి మండలం మంగాపురం తండా  గ్రామంలో  ఇటీవల యాక్సిడెంట్ లో గాయాలు తగిలిన నేలకోండపల్లి మండల యువజన నాయకులు భూక్యా బాలాజీ ని పరామర్శించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ గారు మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు  రాయిగూడెం గ్రామంలో ఇటీవల ఆనారోగ్యంతో మరణించిన  మేకల సత్యం గారి దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..
 నాచేపల్లి గ్రామంలో నాచేపల్లి అనారోగ్యంతో బాధపడుతున్న సొసైటీ డైరెక్టర్ మచ్చా నాగేశ్వరరావు గారిని పరామర్శించి అనంతరం ఇటీవల మరణించిన మందడి వీరమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..
నేలకోండపల్లి* గ్రామంలో ఇటీవల మరణించిన కోత్తా  పల్లపు వెంకటేశ్వర్లు, మామిడి సత్యం,ముత్తీనేని అనంతరామయ్య,కోత్తా రాఘవయ్య, గార్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు...
అచార్లగూడెం* గ్రామంలో ఇటీవల ఆనారోగ్యంతో మరణించిన రేగురి రాజలింగం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన *ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ గారు మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో sc సెల్ అధ్యక్షుడు బొడ్డు బొందయ్య,పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూర నాగరాజు, ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రీపోతుల అంజనీ,ఖమ్మం జిల్లా బిసి సెల్ ఉపాధ్యక్షుడు బోయిన వేణు,మేకపోతుల సురేష్ తదితరులు పాల్గొన్నారు