విద్యార్థుల సర్టిఫికెట్ సమస్యలపై బూర్గంపాడు తాసిల్దార్ భగవాన్ రెడ్డికి వినతి పత్రం అందజేస
Published: Tuesday November 08, 2022
భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థీ విభాగం నాయకులు సందీప్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ గా తరలి తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ భగవాన్ రెడ్డి ని కలిసి విద్యార్థుల ఆధాయ,కుల ధ్రువీకర పత్రాలు తొరగా ఇవ్వాలని మెమొండరంలో కోరారు.ఈ సందర్భంగా తహసిల్దార్ భగవాన్ రెడ్డి వారితో మాట్లాడుతూ ఇప్పటివరకు ఏ ఒక్క విద్యార్థికి చెందిన ఆధాయ,కుల ధ్రువీకర పత్రాలు పెండింగ్ లో లేవ్వని ఎవరైనా విద్యార్థులు తమ ఆధాయ,కుల ధ్రువీకరణ,పలు పత్రాలు అత్యవసరం ఉన్నా ఏమైనా సమస్య ఉంటే వెంటనే నేరుగా కలిసి చెబితే తమ సమస్య పరిష్కారం వెంఠనే జరుగుతుందని సానుకూలంగా స్పందించి విద్యార్థీనీ,విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ విభాగానికి సమాధానం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంట ఆర్ ఐ అక్బర్ ఉన్నారు.
Share this on your social network: