ఎమ్మెల్సీ తాతా మధు గెలుపు కాంక్షిస్తూ మధిర నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు ఎన్నికల సమరభేరీ

Published: Wednesday December 01, 2021
ఎర్రుపాలెం నవంబర్ 30 ప్రజాపాలన ప్రతినిధి : ఎమ్ ఎల్ సి అభ్యర్థి శ్రీ తాత మధు గారు గెలుపును కాంక్షిస్తు ఎన్నికల క్యాంపెన్ కు గోవా బైలుదేరిన మధిర, ఎర్రుపాలెం, ఎంపీపీలు లు, ఎంపీటీసీ లు, మున్సిపాల్ చైర్మన్ లు, వార్డు కౌన్సిలర్లు, జడ్పీటీసీలు మధిర నుండి బయలుదేరి వెళ్ళినారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శ్రీ లింగాల కమలరాజు మాట్లాడుతూ తాత మధు గెలుపుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధిర వ్వవసాయ మార్కెట్ చైర్మన్ చిత్తారు నాగేశ్వరావు, మధిర వ్వవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, మధిర, ఎర్రుపాలెం మండలం అధ్యక్షులు ముఖ్య నాయకులు జండా ఊపి ఎన్నికల సమరభేరిని ప్రారంభించినారు.