గులాబీ జెండా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక

Published: Saturday February 20, 2021

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి 19 ( ప్రజాపాలన ): గులాబీ జెండా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అని  వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.శుక్రవారం కోటపల్లి మండల పరిధిలోని జిన్నారం, ఎన్కేపల్లి, రాంపూర్, కొత్తపల్లి గ్రామాలలో గులాబి భరోసా కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ జహాంగీర్ పాషాలతో కలిసి పార్టీ సభ్యత్వం, జెండా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి టిఆర్ఎస్ ప్రభుత్వం సభ్యత్వ నమోదు చేపడుతుందన్నారు. కార్యకర్తలందరూ తప్పనిసరిగా సభ్యత్వ నమోదు చేసుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వం అందించే రెండు లక్షల రూపాయల భీమా వర్తిస్తుందన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అమలులోలేవని గుర్తు చేశారు. ఈ పథకాలకు ఆకర్షితులై పార్టీలో ఎప్పటికప్పుడు కొత్త కార్యకర్తలు చేరడం జరిగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్, ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి, పిఏసిఎస్ ఛైర్మన్ రాంచెంద్రారెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు సత్యం, వైస్ ఎంపిపి ఉమాదేవి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.