మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసిన మండపాలకు రూ 5 వేలు అందజేసిన మేయర్లు

Published: Monday September 20, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో 3వ డివిజన్ సాయి మహాదేవ్ నగర్, ఇంద్రప్రస్తా కాలనీ, 15వ డివిజన్ విహరిక కాలనీ,25వ డివిజన్ క్రాంతి కాలనీ, 1వ డివిజన్ ఈస్ట్ కమలా నగర్, విశ్వం విహర్ కాలనీ, 26వ డివిజన్ శంకర్ నగర్ కాలనీల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాలను సందర్శించి, మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసిన వారికి రూ 5 వేల రూపాయల నగదును మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ లు అందజేశారు. అనంతరం మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, బండారు మంజుల, పిట్టల మల్లేష్, భీంరెడ్డి నవీన్ రెడ్డి, అమర్ సింగ్, కో ఆప్షన్ సభ్యులు చిలుముల జగదేశ్వర్ రెడ్డి, డిఐ జానీ, నాయకులు పప్పుల అంజిరెడ్డి, బైటింటి ఈశ్వర్ రెడ్డి, బండారు రవీందర్, బండి సతీష్ గౌడ్, జావిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.