పల్లా రాజేశ్వర్ రెడ్డి ని గెలిపించాలి: కౌన్సిలర్ ఎర్రగుంట లక్ష్మి

Published: Thursday March 04, 2021

మధిర మార్చి4 ప్రజాపాలన ప్రతినిధి: రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో పోటీ చేస్తున్న ఖమ్మం వరంగల్ నల్లగొండ పట్టభద్రుల టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని 21వ వార్డు కౌన్సిలర్ ఎర్రగుంట లక్ష్మి కోరారు. బుధవారం ఆమె పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, పట్టభద్రులు కలిసి ఓట్లు అడిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగిందన్నారు. బంగారు తెలంగాణ గా తీర్చిదిద్దుతున్న కెసిఆర్ ప్రభుత్వానికి మద్దతు పల్లా రాజేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. తెలిపి ఆమె వెంట టిఆర్ఎస్ నాయకులు ఎర్రగుంట రమేష్ పవన్ సాయి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.