బోడుప్పల్ నగర అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కేటీఆర్ కు వినతి

Published: Wednesday June 23, 2021
మేడిపల్లి, జూన్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మరియు బోడుప్పల్ నగర దళిత సోదరులకు సంబంధించిన సర్వే నెంబర్ 63/2 నుండి 63/25 వరకు గల అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ చేయాలని కోరుతూ నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి, బోడుప్పల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి కార్మికశాఖా మాత్యులు చామకూర మల్లారెడ్డి సమక్షంలో మున్సిపల్, ఐటీ శాఖామాత్యులు కల్వకుంట్ల తారకరామారావును ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ నగర మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.