భారత రాజ్యాంగ విలువలను పరిరక్షించాలి

Published: Thursday January 27, 2022
ప్రముఖ పిల్లల వైద్యుడు టి.ఆనంద్
వికారాబాద్ బ్యూరో 26 జనవరి ప్రజాపాలన : భారత రాజ్యాంగ విలువలను పరి రక్షించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రముఖ పిల్లల వైద్యులు టి.ఆనంద్ హితవు పలికారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి నుండి రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు జిల్లా దళిత శక్తి ప్రోగ్రాం అధ్యక్షుడు రవీందర్ మహారాజ్ ఆధ్వర్యంలో దళిత శక్తి ప్రోగ్రాం వికారాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, మౌలిక రంగాలలో మార్పును తీసుకొచ్చే విప్లవ గ్రంథమే భారత రాజ్యాంగం అని కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఫలాలు దేశంలోని 90 శాతం ప్రజలకు అందాలనే ఆశయాన్ని దళిత శక్తి ప్రోగ్రాం ఉద్యమం చేయడానికి సిద్ధం అయిందని స్పష్టం చేశారు. విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో దళిత శక్తి ప్రోగ్రాం ఉద్యమం పనిచేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మహారాజ్, వెంకట్ రాములు మహారాజ్, వెంకట్ మహారాజ్, మల్లికార్జున్, ప్రభాకర్, రవి, దళిత శక్తి ప్రోగ్రాం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.