బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్దం చేసిన తెరాస నాయకులు

Published: Thursday November 18, 2021

సారంగాపూర్, నవంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి) సారంగాపూర్ మండల కేంద్రంలోని తెరాస నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంగళవారం రోజున సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దగ్దం చేయడంతో దానికి నిరసనగా బుధవారం రోజున మండల కేంద్రంలో తెరాస నాయకులు ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి ఎంపీటీసీలు జోగినపల్లి సుధాకర్ రావు భూక్య లావణ్య సర్పంచులు గుర్రాల రాజేందర్ రెడ్డి అరే లక్ష్మీ పల్లపు వెంకటేష్ బేక్యం జమున ప్యాక్స్ చెర్మన్లు ఏలేటి నర్సింహారెడ్డి మల్లారెడి మండల్ రైతుబందు కన్వీనర్ కోల శ్రీనివాస్ తెరాస నాయకులు తోడేటి శేఖర్ గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.