పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిన సైదులు నాయక్..

Published: Monday January 16, 2023
వైరా, జనవరి 14 (ప్రజాపాలన న్యూస్):
ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డిని వైరా నియోజకవర్గ నాయకులు, ఉప్పల్ చెలక మాజీ సర్పంచ్ బాదావత్ సైదులు నాయక్ కలిశారు. శనివారం నారాయణపురంలో పొంగులేటిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు, పూలమాలతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా సైదులు నాయక్ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లు తెలిపారు. పండగ పూట ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో పాడిపంటలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మూలగూడెం సర్పంచ్ జర్పుల నాగేశ్వరరావు, అజ్మీర రాము ఉన్నారు.