అర్షన్ ను దీవించిన జక్కంపూడి, గోపిశెట్టి..

Published: Monday November 14, 2022
తల్లాడ, నవంబర్ 13 (ప్రజాపాలన న్యూస్):
 తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు షేక్ యాకూబ్ పాషా, షాహిన్ దంపతుల కుమారుడు హర్షణ్ పుట్రెంటుకల వేడుక ఆదివారం ఆయన స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, గోపిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు తుమ్మలపల్లి రమేష్, పొన్నం కృష్ణయ్య, అన్నారుగూడెం మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్, సరికొండ హరీష్ రాజు, ప్రముఖ జర్నలిస్ట్ ఎండి బహుదూర్,  పాల్గొన్నారు.