దుర్గం చెరువులో వైఎస్సార్ టిపి జెండా కార్యక్రమం

Published: Tuesday December 27, 2022
జిల్లా వైఎస్సార్ టిపి అధికార ప్రతినిధి కావలి వసంత్ కుమార్
వికారాబాద్ బ్యూరో 26 డిసెంబర్ ప్రజా పాలన : రాబోవు ఎన్నికల్లో వైఎస్ఆర్ టిపి జండా ఎగరవేయడం ఖాయమని జిల్లా వైఎస్ఆర్ టిపి అధికార ప్రతినిధి కావలి వసంత్ కుమార్ అన్నారు. సోమవారం మోమిన్ పెట్ మండల పరిధిలో గల దుర్గం చెరువు గ్రామంలో వైఎస్ఆర్ టిపి జండా కార్యక్రమాన్ని మోమిన్ పెట్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇసాక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన తిరిగి తేవడానికి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర చేపట్టిందని తెలిపారు. ఎండనకా వాననకా 3500 కి.మీ పాదయాత్ర చేపట్టిందని వివరించారు. ప్రజలతో మమేకమవుతూ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను ఎత్తిచూపుతున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల పాలన కొనసాగించనున్నారని జోస్యం చెప్పారు. దుర్గంచెరువు గ్రామంలో ఇంటింటికి వైఎస్ఆర్ టి పి జెండాను చేరవేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ టిపి అధ్యక్షుడు మామిడి సంగమేశ్వర్ యువజన సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ వికారాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శశివర్ధన్ వికారాబాద్ మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి రాఘవరెడ్డి మండల ఎస్టీసెల్ అధ్యక్షుడు రాజు నాయక్ నాయకులు కార్యకర్తలు దుర్గం చెరువు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.