*ఎర్రజెండాతోనే ప్రజల సమస్యలకు పరిష్కారంసిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవిబాబు*

Published: Thursday December 15, 2022

మధిర డిసెంబర్  14 (ప్రజా పాలన ప్రతినిధి) ఎర్రజెండాతోనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవిబాబు అన్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికై  భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా సమితి పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం మధిర తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ (బిఆర్ఎస్) ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిదేళ్లు అవుతున్న నేటికీ ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవటం టిఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థ పాలనే కారణమని దుయ్యబట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్లస్థలాలు, పోడు భూముల పట్టాలు, రేషన్ కార్డులు,వెంటనే మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలో కనీసం సొంత ఇళ్ళు లేని  వారు సుమారు 20 లక్షలమందికి పైగా ఉన్నారన్నారు. అనేక మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నారు.వచ్చే ఆర కొర ఆదాయంతో అద్దె ఇళ్ళలో నివశిస్తూ అనేక మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. అర్హులైన వారందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇళ్ళస్థలాలు వెంటనే కేటాయించాలన్నారు .అనంతరం తహసిల్దార్ కు తదితర డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు..ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి వుట్ల కొండలరావు సహాయ కార్యదర్శి చావా  మురళీకృష్ణ, పంగ శేషగిరిరావు, పెరుమళ్ళపల్లి ప్రకాష్ రావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, తలారి రమేష్, శిలువేరు  శ్రీనివాసరావు, చెరుకూరు వెంకటేశ్వరరావు,మంగళగిరి రామాంజనేయులు,వుట్ల కామేశ్వరరావు,వుట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.