స్మశాన వాటిక పనులను వేగవంతం చేయాలి ** జిపి ఇన్చార్జి ఈఓ వంశీకృష్ణ *

Published: Friday December 02, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 30 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న స్మశాన వాటిక పనులను కవిత గతి నా పూర్తి చేయాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఖాండ్రే విశాల్, సెర్ల మురళీధర్ లు అన్నారు. బుధవారం స్మశాన వాటిక పనులను గ్రామపంచాయతీ ఇన్చార్జి ఈవో వంశీకృష్ణ, మండల సర్వేయర్ భరత్ తో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఉపాధ్యక్షుడు విశాల్ మాట్లాడుతూ స్మశాన వాటిక పనులను ప్రారంభించి 3 సంవత్సరాలు అవుతున్న  నేటికీ పనులు పూర్తి కాలేదని, ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంతే క్రియలు చేయాలంటే వాగులు, వంకల పక్కనే చేయాల్సి వస్తుందని, ఇప్పుడు అది కూడా ప్రస్తుతం 4 లైన్ల రోడ్డు పనులు సాగుతుండడంతో కనీసం దారి కూడా లేదని అన్నారు.ముఖ్యంగా వర్షాకాలం సమస్య మరీ తీవ్రంగా ఉంటుందన్నారు. సరిగ్గా వచ్చిన స్మశాన వాటిక పనులు పూర్తి చేయాలని కోరారు.వీరి వెంట పార్టీ మండలాధ్యక్షుడు ఈదులవాడ గణేష్, జిపి సిబ్బంది పాల్గొన్నారు.