కనకపూడి సంతాపసభలో సిపిఐ నాయుకులు మందడపు నాగేశ్వరరావు, బెజవాడ రవిబాబు

Published: Tuesday April 06, 2021

ప్రజాపాలన ప్రతినిధి, మధిర, ఏప్రిల్ 05 : మున్సిపాలిటీ పరిధిలో మడుపల్లి  గ్రామానికి చెందిన అమరజీవి కామ్రేడ్ కనకపూడి చిన్న సుబ్బారావు దశదిన కర్మ నేడు మడుపల్లి గ్రామం లో ఏర్పాటు చేశారు. కాగా ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర నాయకులు మందడపు నాగేశ్వరరావు, సిపిఐ మధిర పట్టణకార్యదర్శి బెజవాడ రవిబాబు, పాల్గొని వారు మాట్లాడుతూ కనకపూడి చిన్న సుబ్బారావు, సిపిఐ పార్టీ ఎదుగుదలకు మడుపల్లి గ్రామంలో ఎంతో కృషి చేశారని నిబద్ధత కలిగిన కమ్యూనిస్టుని కోల్పోవడం చాలా బాధాకరం అని వారన్నారు. పేదల పక్షాన అనేక పోరాటాల్లో చిన్న సుబ్బారావు పాల్గొన్నారు అని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో వారి కుమారుడు కనకపుడి కృష్ణంరాజు, పెరుమలపల్లి ప్రకాష్ రావు, అన్నవరం సత్యనారాయణ,పంగ శేషగిరిరావు,యంగ్ శీను,కొండూరు నాగేశ్వరరావు,తలారి రమేష్, నరసింహరావు, నాగ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు