మంచాల లో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి

Published: Friday September 03, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మంచాల మండలం లో వైయస్సార్12 వ వర్ధంతి వేడుకలు వైయస్సార్ ఆశయ సాధన కోసం పని చేయాలి వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని జంగయ్యగౌడ్ మంచాల మండలం స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ మండలం నాయకుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో లింగం పల్లి గ్రామంలో ఉన్న వైయస్సార్ విగ్రహానికి పులా మాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని జంగయ్యగౌడ్ మాట్లాడుతూ స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో పేదప్రజల కోసం  రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇండ్లు 108 రైతులకు ఉచిత విద్యుత్ ఇంక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహా నేత వైయస్సార్ గారు అలాంటి నాయకుడి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం నాయకుడు గోరెంకాల నందకుమార్ ముదిరాజ్ మంచాల మండలం సీనియర్ నాయకుడు బూర జంగయ్యగౌడ్ వైయస్సార్ పార్టీ నాయకులు బూడిద మహేందర్ కర్నాటి ముఖేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు