మాజీ ఎంపీ పొంగులేటి సుడిగాలి పర్యటన..

Published: Monday September 27, 2021
పాలేరు సెప్టెంబర్ 26 ప్రజాపాలన ( ప్రతినిధి) : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేలకొండపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఆదివారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. మండలం లోని మోటాపురం, చెన్నారం, బోదులబండ, నేలకొండపల్లి గ్రామాల్లో పలు కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మోటాపురం  ఎంపీటీసీ బాలాజీ ని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చెన్నారంలో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని రజకులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చాగంటి మధుసూదన్ రావు గంజికుంట్ల వెంకన్న, కోదాడ శ్రీనివాసరావు, కిరణ్, సైదారెడ్డి, నల్లమల్ల వెంకటేశ్వర్ల, మేకల వెంకటేశ్వర్ల, అనగాని నరసింహారావు, కోడాలి గోవిందరావు,  తదితరులు పాల్గొన్నారు.