బాధిత కుటుంబాలకు మంచిరెడ్డి అండ...* *కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మర
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 1ప్రజాపాలన ప్రతినిధిఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సీతారాం పేట్ కి చెందిన అవుతాపురం లావణ్య & మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన మైలారం సుష్మ కుటుంబసభ్యులను ఎమ్మెల్యే గారి పరామర్శించారు.
ఒక్కో కుటుంబానికి 50వేల చొప్పున ఆర్ధిక సహాయం అందజేశారు.
ఈ దురదృష్టకర సంఘటన జరిగిన వెంటనే సీయం శ్రీ కేసీఆర్ దృష్టికి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారి దృష్టికి తీసుకుపోయి విచారణ చేయించడమే కాకుండా బాధిత కుటుంబాలకు 5లక్షల చొప్పున సహాయం అందింపజేసామని చెప్పారు.
వారి కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయించడంతో పాటు, పిల్లల చదువులు, కుటుంబ పెద్దకు ఉపాధి కల్పించే చర్యలు చేపడతామని ఎమ్మెల్యే గారు వివరించారు.
శవాలమీది రాజకీయాలు చేసే చిల్లర అలవాట్లు తనకు లేవన్నారు.
ఆపరేషన్లు చేయించుకున్న మిగిలిన 30మంది మహిళలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
అనంతరం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని పర్యవేక్షించారు.
త్వరలోనే మంత్రి హరీష్ రావు తో ఇబ్రహీంపట్నం, యాచారం ఆసుపత్రుల అభివృద్ధి చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.
Share this on your social network: