నాగవరపు వెంకట్ ముదిరాజ్ మరణం తీరని లోటు
Published: Tuesday May 18, 2021
జనగాం మే 17 ప్రజాపాలన: తెలంగాణ ముదిరాజ్ మహాసభ స్థాపించిన నాటినుండి క్రియాశీలక నాయకుడిగా పనిచేస్తూ జనగామ పట్టణానికే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బడుగు బలహీనవర్గాలకు సేవచేస్తు అంచలంచలుగా ఎదిగిన నా ఆత్మీయ సోదరుడు జనగామ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ నాగవరపు వెంకట్ ముదిరాజ్ గారి మరణం తెలంగాణ ముదిరాజ్ మహాసభకు తీరని లోటు అని డా:బండా ప్రకాష్, ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు, మరియు రాజ్యసభ సభ్యులు అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Share this on your social network: