బెల్లంపల్లిలో కాంగ్రెస్ నాయకుల అరెస్టు

Published: Thursday February 17, 2022
బెల్లంపల్లి, ఫిబ్రవరి 16, ప్రజాపాలన ప్రతినిధి: అస్సాం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినం దుకు నిరసనగా తెలంగాణ పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బెల్లంపల్లి పట్టణంలో మాజీ మంత్రి గడ్డం వినోద్ ఆదేశాల మేరకు టిపిసిసి కార్యదర్శి సూరిబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున బుధవారం నాడు నిరసన తెలియ జేశారు. ఈ సందర్భంగా శాంతిభద్ర తల దృష్ట్యా స్థానిక వన్టౌన్ పోలీసులు సి ఐ ముస్కో రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి 1వ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో మత్తమారి సూరిబాబు, మాజీ ఎమ్మెల్యే అమ్ రాజుల శ్రీదేవి, ముచ్చర్ల మల్లయ్య, గేల్లీ జయరాంయాదవ్, సిలీవెరీ సత్యనారాయణ, మేకల శ్రీనివాస్, రామగిరి శ్రీను, జంజిరాల రాజమ్, బర్రె మదునయ్య, లెంకల శ్రీనివాస్, తాళ్ల కృష్ణమోహన్, సోదే వినేష్, పోచంపల్లి హరీష్, ఆడెపు మహేష్, రాజా బ్రహ్మం, కుమ్మరి శంకర్, దేవసాని ఆనంద్, మెరుగు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.