ఎన్ సి సి క్యాంపుకు ఎంపిక ఆయిన పాఠశాల విద్యార్థులు

Published: Thursday July 29, 2021
రామచంద్రాపురం, జూలై 28, ప్రజాపాలన ప్రతినిధి : రామచంద్రాపురంలోని అశోక్ నగర్ సేంట్ ఆర్నాల్డ్ పాఠశాలలో ఎన్ సిసి క్యాంపు 33(టి)బిఎన్ బ్యాచ్. సంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ద్వారా 25 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు. పాఠశాల ఎన్ సిసి శిక్షనోపాధ్యాయులు శామ్యూల్ ఆల్ఫ్రెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కాంప్ లోసుబేధార్ జివి శేఖర్ మరియు హావిల్దార్ రంజిత్ సింగ్ లు పాల్గొని ఎంపిక చేయడం జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్ జియో ప్రాస్టిన్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు ఎన్ సిసి క్యాంపుకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎన్ సిసి క్యాంపు కు ఎంపిక ఆయిన పి.ఆలేఖ్య తండ్రి రాజు మాట్లాడుతూ ఎన్ సిసి ద్వారా పిల్లలలో క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. క్రమశిక్షణతో పాటు దేహదారుడ్యం ఉంటుందని అన్నారు. తన కూతురు ఎన్ సిసి క్యాంపు కు ఎంపిక కావడం పట్ల సంతోషం వెలిబుచ్చారు.