కావూరి తులసమ్మ ప్రధమ వర్ధంతి

Published: Monday October 18, 2021
బోనకల్, అక్టోబర్ 17, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని గోవిందా పురం ఎ గ్రామంలో కావూరి తులసమ్మ ప్రధమ వర్ధంతి సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాలయ ఇంచార్జి తంబుర దయాకర్ రెడ్డి తులసమ్మ కుటుంబ సభ్యులను అనగా కావూరి ప్రకాష్ రావు, కావూరి రమేష్ లను కలిసి తులసమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కావూరి రమేష్ గ్రామంలో తన తల్లి పేరు మీద మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినారు. అనంతరం ఆళ్లపాడు గ్రామంలో తంబూరి దయాకర్రెడ్డి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తోటకూర వెంకటేశ్వరరావు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగం శ్రీనివాసరావు, టిఆర్ఎస్ నాయకులు ఉమ్మి నేని కృష్ణ, బోయినపల్లి మురళి, భాగం నాగేశ్వరరావు, కిన్నెర పాపారావు, గొడుగు కృష్ణ, చంద్ర కిరణ్, నల్ల పోయిన కృష్ణారావు, వడ్డెబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు.