మజీద్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి

Published: Wednesday March 29, 2023
మేడిపల్లి, మార్చి 28 (ప్రజాపాలన ప్రతినిధి)
రంజాన్ మాసం సందర్భంగా 
రామంతాపూర్లోని కుతుబ్షాయి మజీద్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ‌హ‌నీయుడైన మహ్మద్ ప్ర‌వ‌క్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భ‌వించిన‌ ఈ రంజాన్ మాసంలో నెల రోజుల‌పాటు నియ‌మ, నిష్ఠల‌తో ముస్లిం సోదరులు క‌ఠిన ఉప‌వాస వ్ర‌తం ఆచ‌రించి అల్లాహ్ కృపకు పాత్రులవుతారని మరియు క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ జాంగిర్, సర్వార్ జహంగీర్ పాషా, తాజ్ బషీర్, నయీం
ఈక్రమ్, చాంద్ పాషా యూసుఫ్ , ఒదిన్,రకుల్ ఇమ్రాన్ ,ఫైరిం, కరీం తదితరులు పాల్గొన్నారు.