నూతనకల్లులో పోడుభూమి సాగు దారులకు అవగాహన సదస్సు..

Published: Wednesday November 17, 2021
తల్లాడ, నవంబర్ 16 (ప్రజాపాలన న్యూస్) : తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామంలో గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న సాగు దారులకు అవగాహన సదస్సు (గ్రామ సభ) మంగళవారం నిర్వహించారు. ఈ సదస్సుకు ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, ఎంపీడీవో రవీంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో ఎంతమంది పోడు భూములను సాగు చేసుకుంటున్నారని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సాగు చేసుకుంటున్నారా.. పోడు భూములు సాగు చేసుకునేవారు తమ గ్రామపంచాయతీ అధికారులకు వినతులను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గి దేవర వెంకట్ లాల్, గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ సీతారాములు, వైరా మార్కెట్ డైరెక్టర్ నాయుడు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ శెట్టిపల్లి లక్ష్మణరావు, సెక్రెటరీ ఇ జాజ్, ఏఈవో, పలువురు పోడు సాగుదారులు పాల్గొన్నారు.