అంత్యక్రియలకు ఆర్థిక చేయీత

Published: Tuesday January 03, 2023
* డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 02 జనవరి ప్రజాపాలన : దోమ మండల కేంద్రానికి చెందిన మల్కాపురం చెంద్రయ్య ఇటీవల మరణించడంతో అంత్యక్రియలకు ఆర్థిక సహకారం అందజేశామని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణ వార్త తెలియగానే మృతుని ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చామని అన్నారు. మృతుని కుటుంబ సభ్యులకు అంత్యక్రియల నిమిత్తం రూ.5000 లు అందజేశామని స్పష్టం చేశారు. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో తన సహచరులతో మృతుడి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో దోమ ఎంపీటీసీ బంగ్లా అనితయాదయ్య గౌడ్, ముస్తఫా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ డప్పు శేఖర్, డప్పు యాదయ్య, మాజీ విద్య కమిటీ చైర్మన్ ఈడిగి యాదయ్య, మల్కాపురం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.