మల్లు భట్టి విక్రమార్కరకి కృతజ్ఞతలు తెలిపిన దళితబంధు యూనిట్ల లబ్దిదారులు

Published: Thursday October 20, 2022
మధిిర రూరల్, అక్టోబర్ 19: ప్రజాపాలన ప్రతినిధినియోజకవర్గ పరిధిలో బుధవారం నాడు స్థానిక సీఎల్పీీీ బట్టిి కార్యాలయంలో  ఎమ్మెల్యే,సీఏల్పి నాయకులు మల్లు భట్టి విక్రమార్క ద్వారా దళిత బంధు పథకం ద్వారా లబ్దిపొందిన సిరిపురం గ్రామానికి చెందిన కోపల్లి భాస్కర్ (డీజే),కనకపూడి అశోక్ (మిని ట్రాక్టర్) పగిడిపల్లి డేవిడ్ (అశోక్ లేయలండ్) మంజూరైన దలితబందు యూనిట్లను బుధవారం మధిర ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అమ్మా ఫౌండేషన్ ఛైర్మెన్ మల్లు నందిని విక్రమార్కని లబ్దిదారులు కలిసి మల్లు భట్టి విక్రమార్క కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా మల్లు నందినీ విక్రమార్క మాట్లాడుతూ దళిత బంధు ద్వారా లబ్ది పొందిన వారికీ అభినందనలు తెలియజేస్తు వారు ఆర్థికంగా ఎదగాలని  ఆకాంక్షిస్తు,
సమాజంలో అనేక దశాబ్దాలుగా దళితులు వివక్ష ఎదుర్కొంటున్నారని,వారి అభివృద్ధి కోసం నిరంతరం భట్టి విక్రమార్క చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరంసెట్టి కిషోర్ కుమార్,మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కర్నాటి రామారావు,మండల ఎస్సి సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు,మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి,మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంపా వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 
 
 
 
Attachments area