మానసిక వికలాంగులకు అన్నదానం

Published: Tuesday March 09, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని టేకులసోమారం గ్రామంలో గల సాధన మానసిక వికలాంగుల సంస్థలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం బుస్స కిష్టమ్మ జ్ఞాపకార్థం ఆమె మనుమడు ఎన్ఆర్ఐ బుస్స నాగరాజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  కాసుల వెంకటేశం, పబ్బు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.