సూపర్ స్పైడర్ వ్యాక్సినేషన్ సెంటర్స్ పరిశీలన

Published: Wednesday June 02, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి 105 డివిజన్ లో తలపెట్టిన సూపర్ స్పైడర్ వ్యాక్సినేషన్ సెంటర్లు, గచ్చిబౌలిలేని సంధ్యా కన్వెన్షన్ హాల్, హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్.ఎం టి.కాలనీ సెంటర్లను రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, స్థానిక నియోజకవర్గ నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు రవి కుమార్ యాదవ్ వ్యాక్సినేషన్ సెంటర్ పర్యవేక్షకులు స్వామి, డిప్యూటీ కమీషనర్ వెంకన్నలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెంటర్లో రోజుకు సుమారు "850" వరకు వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేసారు. వారు మాట్లాడుతూ సూపర్ స్పైడర్ వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే వ్యాక్సిన్ అందరికీ అందే విధంగా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, మేడ్చల్ జిల్లా బిజెపి సెక్రెటరీ విజిత్ వర్మ, సీనియర్ నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్, అరవింద్ యాదవ్, మన్నే రమేష్, సీతారామరాజు, చారి, ఆంజనేయులు యాదవ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.