ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాల పాలన భేష్

Published: Monday May 31, 2021

-జిల్లా ప్రధాన కార్యదర్శి బైండ్ల కుమార్
-పండ్లు పంపిణి చేసిన బీజేపీ నాయకులు

బొల్లారం, మే 30, ప్రజాపాలన ప్రతినిధి : బొల్లారం మున్సిపల్ పరిధిలో బీజేపీ నాయకులు కొత్వాల్  ఆనంద్ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా బీజేపీ పార్టీ కార్యదర్శి బండ్ల కుమార్ హాజరై బొల్లారం మున్సిపాలిటీలో 14వ వార్డులో సుమారు 100 మందికి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల మరణించిన బీజేపీ కార్యకర్త కుటుంబానికి సుమారు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి బండ్ల కుమార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పాలన ఏడు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించమని, ప్రపంచ దేశాలు మెప్పించేలా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా అలాంటి విపత్కర ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి అండగా నిలబడ్డారని ఆయన కొనియాడారు