మందడపు నాగేశ్వరరావు సంతాపసభ

Published: Friday June 04, 2021
మధిర, జూన్ 03, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం మల్లారం గ్రామ ఎంపీటీసీ, సిపిఐ రాష్ట్ర నాయకులు మందడపు నాగేశ్వరరావు గారు ఇటీవల మరణించడంతో వారి స్వగ్రామము లో జరుగుతున్నటువంటి సంతాప సభకు హాజరై, గ్రామం లో ఏర్పాటు చేసిన వారి విగ్రహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగేశ్వరావు ప్రజల మనిషి అని నియోజకవర్గంలోని మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి అని ప్రజల మనసులోని ఆయనెప్పుడూ ఉన్నాడని వారు తెలిపారు ఈ సంతాపంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం గారు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు గారు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చితారు నాగేశ్వరరావు గారు, రైతు బంధు సమితి మధిర మండల కన్వీనర్ చావా వేణు, మధిర మండల టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, టిఆర్ఎస్ యువజన నాయకుడు కోనా నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.