పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Published: Monday September 12, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 11 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గంలోని   తాండూర్ మండలం రేచిని, గంపలపల్లి, బారెపల్లి, అన్నారం, బలాన్ పూర్, ఆచ్చులాపూర్, గంపలపల్లి, కొమ్ముగూడెం గ్రామాలకు చెందిన 198 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పెన్షన్ గుర్తింపు కార్డులను  బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య స్థానికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆదివారం  అందించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సాలిగామా బానయ్య , ఎంపీపీ ప్రణయ్ , ఎంపీటీసీలు మొగిలి శంకర్, సిరంగి శంకర్ , శ్రీదేవి , సర్పంచ్ లు దుర్గభాయ్, శంకరమ్మ , సింగిల్ విండో ఛైర్మన్ దత్తుమూర్తి , ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area