అన్నారుగూడెంలో అ"పూర్వ" విద్యార్థుల సమ్మేళనం..

Published: Monday July 04, 2022
తల్లాడ, జూన్ 3 (ప్రజాపాలన న్యూస్):
 
తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-01 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం గ్రామంలోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనాటి గురువులు కోటేశ్వరరావు, రంగారావు, సదానందం, రాంబాబు, నరేంద్ర రాజు, దామోదర్ ప్రసాద్ లను శాలువాలు పూలమాలలతో సన్మానించి సత్కరించారు. ఆనాటి మధురస్మృతులను ఒకరినొకరు నెమరు వేసుకొని ఉల్లాసంగా గడిపారు. పూర్వ విద్యార్థులందరూ పలు రంగాల్లో స్థిరపడి వారు చేసే రంగాలను చెప్పడంతో గురువులు సంతోషించారు. అనంతరం ఎంఈఓ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ తాము చదువు చెప్పిన విద్యార్థులు ఉద్యోగంతో పాటు పలు రంగాల్లో స్థిరపడటం  సంతోషంగా ఉందన్నారు. సమాజంలో ప్రతి విద్యార్థి చిన్ననాటి నుంచే మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.