బండి సంజయ్ ను కలిసిన శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు

Published: Saturday March 13, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాగా ప్రచారం చేసి, ప్రభుత్వం చేస్తున్న అవినీతి పాలనను ఎండ గట్టడంలో బీజేపీ శ్రేణులు బాగా పనిచేశారని వారందరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభినందినట్లు ఆయనను కలిసిన నాయకులు తెలిపారు. ఇక ముందు కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, పార్టీని అభివృద్ధి, నిర్మాణం కొరకు కృషి చేయాలని వారికి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంగా నగరంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి శేరిలింగంపల్లి నియోజకవర్గo నుండి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, గుండె గణేష్ ముదిరాజ్, జాజిరావు, శ్రీను, గంగారం మల్లేష్, రవీందర్ రెడ్డి, రాము,జాజిరావు, సోనుకుమార్ యాదవ్, నరేష్, శ్రీధర్, జాజిరావు, నారాయణ, కుత్బుల్లాపూర్ నుండి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ లు హాజరైనట్లు తెలిపారు.