ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎంపీపీ అరిగేల మల్లికార్జున్
Published: Monday July 11, 2022
ఆసిఫాబాద్ జిల్లా జులై 10(ప్రజాపాలన, ప్రతినిధి) : భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని తుంపెల్లి పల్లి వాగు, తో పాటు వట్టి వాగు నుండి వదిలిన నీటితో మునిగిన పంట పొలాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వర్షాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా బ్రిడ్జిల పై నుండి నీళ్లు రాసిస్తే అక్కడి నుండి దాటకూడదన్నారు. పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఆయనతో పాటుమండల నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: