వెలుగు గుట్ట శ్రీమల్లిఖార్జున స్వామి దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

Published: Thursday September 29, 2022
మేడిపల్లి, సెప్టెంబర్28 (ప్రజాపాలన ప్రతినిధి)
దసరా నవరాత్రి ఉత్సవాలను పరిష్కరించుకొని వెలుగు గుట్ట శ్రీమల్లిఖార్జున స్వామి దేవాలయంలో
భక్తుల కోర్కెలు తీర్చే ఆ జగన్మాత శ్రీ దుర్గాపరమేశ్వరి అమ్మవారికి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా  మూడవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు విశేషంగా దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం అమ్మవారికి విశేషముగా పంచామృత అభిషేకము, శ్రీ సూక్త దుర్గా సూక్త, రుద్ర పారాయణ సహితముగా విశేషంగా అభిషేకము, సువాసినిలచే కుంకుమార్చన,తీర్థ ప్రసాద వితరణ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు . తదనంతరం చండీ హోమము ,మహా మంగళహారతి తీర్థప్రసాద వితరణ దాతలచే అన్నప్రసాద వితరణ అత్యంత భక్తి శ్రద్ధలతో పండుగగా జరిగింది. సాయంత్రం ప్రదోష అర్చనలో భాగంగా శ్రీచక్రానికి కుంకుమార్చన జరిగింది. తదనంతరం ఊంజల్ సేవ మరియు తీర్థప్రసాద వితరణ జరిగినాయి. ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవి, గుమ్మడేల్లి విజయ్ కుమార్, గొరిగే మల్లేష్ కురుమ తదితరులు పాల్గొన్నారు.