అన్నారుగూడెంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

Published: Monday December 12, 2022
తల్లాడ, డిసెంబర్ 11 (ప్రజా పాలన న్యూస్):

తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం తల్లాడ మండల అధ్యక్షురాలు గోడ్ల పుల్లమ్మ మాట్లాడుతూ నిత్యావసర సరుకులు మరి ఆకాశానంటేయని ప్రధానంగా వంట గ్యాస్ ధర విపరీతంగా పెరిగిందని పేద మధ్యతరగతి ప్రజలకు కొనబోతే కొరివిగా తయారైందని వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి వంట గ్యాస్ రేట్ తగ్గించాలని లేనియెడల ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు చాపల రావేలు, నూక పోగు మరియమ్మ, రాణి, రాధా పాల్గొన్నారు.