ట్రాన్సిట్ హోమ్ ని పరిశీలించిన - ఎమ్మెల్యే సంజయ్ కుమార్
Published: Tuesday May 25, 2021
జగిత్యాల, మే 24 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాలలో కరోనతో బాధపడుతూ హోమ్ క్వారంటైన్ లేదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిదండ్రుల పిల్లల యొక్క ఆలన పాలన చూసుకోవడానికి ప్రభుత్వం జిల్లా బాలాల పరిరక్షణ విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ అఫిస్ ప్రక్కన గల ఎస్సి హాస్టల్ దరూర్ క్యాంపులో ట్రాన్సిట్ హోమ్ ను జగిత్యాల ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిలా సంక్షేమశాఖ అధికారి డా.నరేశ్ గట్టు సతీష్ కౌన్సిలర్ తోట మల్లికార్జున్ ఎఫ్సిఎస్ డైరెక్టర్ అరుముళ్ల పవన్ అధికారులు ఉన్నారు. పిల్లల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ 1098 మరియు మహిళల కొరకు హెల్ప్ లైన్ 181 నెంబర్ లను సంప్రదించలని తెలిపారు.
Share this on your social network: