వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కార్తీకమాస అన్నదానం మంచిర్యాల బ్యూరో, అక్టోబర్26, ప్రజాపాలన:

Published: Thursday October 27, 2022

మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ఐబి చౌరస్తాలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా  నెలరోజులు నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్తీక మాసం పురస్కరించుకొని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నెలరోజులపాటు మానసిక వికలాంగుల పురావాస కేంద్రంలోని మానసిక వికలాంగులకు కూడా అన్నదానాన్ని చేపట్టారు. అలాగే మానసిక వికలాంగులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఏకలవ్య ఆశ్రమానికి పదివేల రూపాయల విరాళాన్ని వాసవి క్లబ్ సభ్యుడు పడకంటి శ్రీనివాస్ చెక్కు రూపంలో అందజేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో అన్నదాతలు ముస్య్తాల సుధాకర్, ముస్య్తాల అశోక్, వాసవి క్లబ్ అంతర్జాతీయ  ఉపాధ్యక్షులు ముక్తా శ్రీనివాస్, కటకం హరీష్, అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు కొండ చంద్రశేఖర్, దొంతుల ముఖేష్, జిల్లా వికేఎస్పీ ఇన్చార్జి అప్పల శ్రీధర్, ప్రోగ్రాం చైర్మన్ పడకంటి శ్రీనివాస్, జోన్ చైర్మన్ కాచం సతీష్, వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ ,కార్యదర్శి నలమాస్ ప్రవీణ్ ,వాసవి క్లబ్ నాయకులు చిలువేరు వైకుంఠం, కొత్త రాజేశం , చిలువేరు శ్రీనివాస్ , ఎర్రం వెంకటేష్ , పడకటి లింగమూర్తి , గంప నాగేందర్, నూక రాజశేఖర్ తోపాటు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.