నర్సింగరావు కుటుంబానికి ఆర్థిక సహాయం

Published: Friday August 27, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని వెల్వర్తి గ్రామానికి చెందిన కూచిమల్ల నర్సింగరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబానికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని వెలువర్తి యూత్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు విశ్రాంత మండల విద్యాధికారి రెడ్డి చేన్న కృష్ణారెడ్డి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని గురువారం వెల్వర్తి యూత్ అసోసియేషన్ సభ్యుల చేతి మీదుగా మృతుని భార్య నాగమణికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కూచిమల్ల సుధాకర్, మల్లం నరేష్, దాసబోయిన వెంకట్, మల్లం మహేష్, ఉపేందర్, శ్రీకాంత్, నాగేందర్, మద్దెల చిరంజీవి, కుశంగి కిరణ్, విజయ్, చందు, వంశీ, అంజయ్య, సోమలింగం, రాము, వంశీ, ప్రణీత్, రాజు, లక్ష్మణ్, ఆనందం, భగవత్, తదితరులు పాల్గొన్నారు.