చీమలపాడు ప్రమాదంలో మరణించిన మృతులకు ఎర్రుపాలెం టిఆర్ఎస్ పార్టీ ఘన నివాళులు.
Published: Thursday April 13, 2023
ఎర్రుపాలెం ఏప్రిల్ 12 బుధవారం (ప్రజాపాలన ప్రతినిధి) ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో జరిగిన విషాద ఘటనలో ఎర్రుపాలెం మండలం బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పంబి.సాంబశివరావు ,మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ చావ రామకృష్ణ ,కార్యదర్శి యన్నం
శ్రీనివాసరెడ్డి ,మరణించిన మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి ,మరణించిన వారికి అన్ని రకాలుగా ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాం. టిఆర్ఎస్ పార్టీ వారికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామని తెలియజేస్తున్నాం.
Share this on your social network: