హఫీజ్ పెట్ విలేజ్ లో ప్రజా సమస్యలపై బిజెపి బస్తీబాట

Published: Thursday June 17, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పెట్ విల్లేజ్ లో బిజెపి హఫీజ్ పెట్ డివిజన్  అధ్యక్షుడు శ్రీధర్ రావు అధ్యక్షతన బస్తీలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం బస్తి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, బిజెపి నాయకులు, కార్యకర్తలు బస్తీల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బస్తీబాటలో అనేక సమస్యలు ప్రజలు మా దృష్టికి తీసుకురావటం జరిగింది అని అన్నారు. ప్రజా సమస్యలు ఆర్భాటాలే కాని పరిష్కారం లేదు అని అన్నారు. ముఖ్యంగా దోమల బెడద, విధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సక్రమంగా లేక పోవటం అని ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటురన్నారు అని అన్నారు.  అలాగే పలు బస్తీల్లో నీటి వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే  పూర్తి కానీ రోడ్డుతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అంతేగాక బస్తీలో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి ఉందని, స్థానికంగా పారిశుద్ధ్యం అద్వనంగా తయారైoదన్నారు. అలాగే ప్రతి బస్తి దవాఖానలో ఇటు వర్షాకాలం మరియు అటు కరోనా సమస్యలు ఉన్న నేపథ్యంలో ప్రజలకు మందులతో పాటు డాక్టర్లు గాని, నర్సులు గాని అందుబాటులో ఉండే విదంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి ప్రతి ఒక్కరికి రేషన్ అదేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికైన అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల స్థానిక సమస్యలను పరిష్కరించాలని బిజెపి తరపున డిమాండ్ చేసారు. అలాగే ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోటేశ్వరరావు, రవి గౌడ్, జితేందర్, శ్రీనివాస్, జగన్, సుబ్బారెడ్డి, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.