ప్రయివేట్ దోపిడీ పై ప్రభుత్వం మౌనం వీడాలి
Published: Saturday May 15, 2021
ఆరోగ్య హక్కువేదిక, అధ్యక్షుడు రాజలింగు మోతె.
మంచిర్యల జిల్లా ప్రతినిధి, మే14, ప్రజాపాలన ప్రతినిధి : ప్రయివేట్ దోపిడీ పై ప్రభుత్వం మౌనం వీడాలని, వైద్యం అందక జనాలు చస్తున్నారాని,ఆస్తులు అమ్ముకున్నా..ప్రజల ప్రాణాలు దక్కడం లేదని ఆరోగ్య హక్కు వేదిక అధ్యక్షుడు ,న్యాయ వాది రాజలింగు మోతె అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ కు మరిన్నీ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రయివేటు దోపిడీ పై ప్రభుత్వం మౌనం వీడాలన్నారు. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పోతుల మురళి కృష్ణ, కార్యదర్శి నిమ్మల నరేష్ పాల్గొన్నారు.
Share this on your social network: