ఎమ్మెల్యేని కలిసిన కోలాట బృందం సభ్యులు

Published: Monday October 25, 2021

యాదాద్రి అక్టోబర్ 24 వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని జంగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన కోలాట బృందం సభ్యులు ఆదివారం స్థానిక శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కోలాట బృందం సభ్యులకు కోలాటం పరికరాలకు పూర్తి ఆర్ధిక సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు శివరాత్రి శ్రీనివాస్, మండల యూత్ ఉపాధ్యక్షులు ఆలకుంట రాజు, శివరాత్రి శ్రీనివాస్, ఆలకుంట భాస్కర్, దేశ పాక ఉప్పలయ్య, నాగరాజు, కోలాటం బృందం రజిత, నిర్మల, మంజుల, వెంకటమ్మ, లింగమ్మ, సువర్ణ, లక్ష్మి, అనూష, మంజుల తదితరులు పాల్గొన్నారు