*బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు

Published: Friday January 13, 2023
మధిర రూరల్ జనవరి 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారుజాతీయ యువజన ఉత్సవాల సందర్భంగాఅసోసియేషన్ హాల్ నందు, స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహిస్తూ వారి చిత్రపటానికి మాలాలంకృతుల్ని చేశారు .ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈ సందర్భంగా  ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ  డి.ధీరజ్ కుమార్ మాట్లాడుతూ వివేకానందుని స్ఫూర్తిని ఆయన ఆశయాలను ఈ తరం యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని సమాజం పట్ల బాధ్యతగా వహించాలని ,అన్ని మతాలను సమానంగా ఆదరించాలని, వారి వ్యక్తిత్వాలను పెంచుకొని సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి  వ్యాఖ్యానించారు .ఈ సందర్భంగా ఆలిండియా లాయర్స్ యూనియన్   ముద్రించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు .ఈ కార్యక్రమంలో భార్ అసోసియేషన్ న్యాయవాదులుు పుల్లారావు కోటేశ్వరావు శ్రీనివాస్ వెంకటేశ్వరరావు గోపాల్ సుబ్రహ్మణ్యం జగన్మోహన్రావు మోహన్ దాస్ జనార్ధన్ పూర్ణచంద్రరావు పలువురు అడ్వకేట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసులు  కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.